14, జులై 2019, ఆదివారం

నేలపట్టు...పక్షులు.

నేలపట్టు. ప్రకృతి నాస్వాదిస్తు కొన్ని చిత్రాలు. ఇతర దేశాలనుండి పక్షులు ఇచటి చెరువు దగ్గరకు వలసవస్తుండేవట. ఇది ఒకరైతు పొలమట. దీనిని ఆనాడు బ్రటీషువారు గమనించి ఆభూమిని ప్రభుత్వం స్వాధీన పరచుకొని వాటి అభివృద్ధికి మరికొన్ని వనరులు కలిగించినదట. అవి ఈప్రాంతానికి వచ్చి చక్కని అనువైన ఆహారాన్ని పొంది సంతానాభివృద్ది చేసుకుని సంతాన సమేతంగా స్వస్థానాలకు చేరుతాయట. ఇచట వాటిని మరింత దగ్గరగా చూచేందుకు "బైనాక్లర్స్" ఇస్తారు. దానిద్వారా ఆ పక్షులను చూస్తే వాటి కూనలతో సహా కనిపించి మైమరపిస్తాయి. మనం ఎన్ని చిత్రాలు తీసినా అసంతృప్తే. మామూలు కెమెరా తో తీసిన చిత్రాలు కొంతకాలానికి కనుమరుగౌతాయి. మన కన్నులనే కెమేరాతో తీసినవి మనం బ్రతికి ఉన్నంతవరకు ఉంటాయి. మధురానుభూతిని కలిగిస్తుంటాయి.

 ప్రకృతి జీవుల కెయ్యడ ప్రాణమగును,   
 ప్రేమ పెంచుచు పంచుచు ప్రియముగూర్చి,                                           
 మధురభావాల నిలయమై మానవాళి,  
 మనసుదోచును సతతంబు మాన్యమగును.

 కరుణరస నిర్భర నరుని
 పరమహృదయమెయ్యెడ గన భాసుర మౌగా
 పరమాత్మ తుల్యమగుచును
 ధరవెల్గును శాశ్వతముగ ధన్యంబగుచున్.

చెట్టు చేమలు ఖేచర జీవతతిని
కావవలయును సతతంబు కరుణతోడ
 మహిత సద్గుణశోభిత మనుజుడెపుడు
పరమపూజిత దైవాంశ వరదుడగును.

కామెంట్‌లు లేవు:

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...