15, జులై 2019, సోమవారం

డా. సర్వా సీతారామ చిదంబర శాస్త్రి

సుహృన్మితృలు డా. సర్వా సీతారామ చిదంబర శాస్త్రి గారికి, (డా.రామడుగు వేంకటేశ్వర శర్మ గారి సహాధ్యాయుడినైన) పొన్నెకంటి సూర్యనారాయణ రావు అనిర్వచనీయ ప్రేమాభిమానాలతో వ్రాయునది....
.
    మీరు గురుభావనతో నన్ను "మీ పదవీ విరమణ" సందర్భంగా ఆహ్వానించారు. కాని అప్పటికే స్థిరీకరింపబడిన నా వ్యక్తిగత కార్యక్రమాల వలన రాలేకపోయినందులకు చాలా బాధపడుచున్నాను. కనీసమీ సమాచారము మీకు తెలియపరచుటకును చరవాణి కాని, అంతర్జాల చిరునామా కాని లభించలేదు.
      ఈరోజు మీరు పంపిన "శ్రీ గాయత్రీ మాతృద్విశతి" అందినది. చదివాను.ప్రతి పద్యమత్యంత భక్తి భావప్రపూరితము, సుశబ్దశోభితమై మనోరంజకముగానున్నది. అమ్మ గాయత్రీ దేవి కరుణకు పాత్రులైన మీరు ధన్యులు.

         అమ్మ గాయత్రి కరుణను నందినారు
         పూర్వజన్మంపుపున్నెంబు ప్రోగుగాగ
         కవన పాండిత్యసద్గుణ భువన రవిగ
         శుభముకలుగుత మీకెప్డు సూరివర్య!

         గాయత్రీజప ఫలితము
         వేయేలవచింపలేము విశ్వంబందున్
         మాయామేయజగంబున
         కాయంబదియుండుదనుక కైమోడ్పెతగున్.
                       శుభం భూయాత్!
                   పొన్నెకంటి సూర్యనారాయణ రావు.
                             ది.22.12.2017.
          

కామెంట్‌లు లేవు:

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...